పప్పా పాట పాడనా

సమర్పింపబడినది జనవరి 2, 2014 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

పప్పా పాట పాడనా
మమ్మీ మాటడనా
అన్న ఆటడనా
చెల్లీ కథ చెప్పనా      ||పప్పా||

నా మాటే ఒక  పాటా
నా పాటే పూలతోట

నా ఆటే మెరుపుల వేట
నా కథే ముద్దుల మూట||౨|| ||పప్పా||

అమ్మ నాన్న పల్లవీ
అన్న చెల్లీ చరణాలూ

నేనే ఈ పాటకి రాగం
దీని భావం అనురాగం ||౨|| ||పప్పా||

P.S. Pure Nostalgia. అంతే కానీ, తరిగిపోతున్న అనురాగ బంధాలు, మరుగున పడ్డ నులక మంచం, కాలిపోయిన కుంపటి, పాచిపోయిన పూతరేకు, తగలడుతున్న తెలుగు లాంటి భావాలు నాకు లెవ్వు. భాషాభిమానం ఉంది. కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటివల్ల, పిచ్చి వాగుడి వల్ల తెలుగు నిలవదు. కొంగొత్త ’భావ’వ్యక్తీకరణ వల్ల భాష జీవిస్తూ ఉంటుంది. అది నా నమ్మకం. ఈ బోడి పాట మర్చిపోయినంత మాత్రాన కొంపలేమీ అంటుకుపోవు. మరైతే ఎందుకు రాశారు సార్ అంటారా, దానికి నా సమాధానం ’ప్యూర్ నాస్టాల్జియా’. చాలా ఏళ్ళ క్రితం ఈ పాట రేడియోలో వచ్చేది. కనీసం మా ఇళ్ళల్లో ఎవరో ఒకరు పాడుతూ ఉండేవారు. ఇన్నేళ్ళ తర్వాత, సడన్‌గా గుర్తుకొచ్చి పాడుకున్నాం. మీతో పంచుకున్నాం. పాటొస్తే, మీరూ హమ్ చేసుకోండి.

అబ్బా…. ఔనండి..’హమ్ చేసుకోవడం’ తెలుగులో ఇంకెలా చెప్తారో నాకు తెలీదు. నే హమ్ చేసుకుంటూ వెళ్తున్నా. సి యూ.. బై.
నా మాటే ఒక  పాటా..అ…ఆ…ఆ…….
నా పాటే పూలతోట..

నా ఆటే మెరుపుల వేట
నా కథే ముద్దుల మూట||౨|| ||పప్పా||

తెలుగుబళ్ళు మూసుకుంటున్న ఉగాది

సమర్పింపబడినది ఏప్రిల్ 4, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

రెండేళ్ళ క్రితపు ఉగాదికి, “తెలుగు చచ్చిపోతే తప్పేంటి?” అని మొదలెట్టి,  అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఓ మాదిరిగా  “తెలుగులో ఆలోచించండి” అని చెప్పి వదిలాను. ఇంకా చాలా అన్నాన్లేండి. తెలుగు బ్లాగింగ్‌తో డబ్బెలా సంపాదించుకుందాం అని కూడా అనుకున్నాను.

ఐతే, పోయిన వారం ఈ-టివిలో, లీలగా ఓ వార్త కంటపడింది. It was very discomforting to see that news. So, i was unable to even search/talk about it with anybody else. ప్రభుత్వ బళ్ళలో ఇంగ్లీషు మీడియంని మొదటి తరగతి నుంచే మొదలేట్టాసారట.  తెలుగుమీడియంలో నమోదవుతున్న విద్యార్ధుల సంఖ్య సగానికి సగం పడిపోగా, అటు ఇంగ్లీషు మీడియంలో అంతే పెరుగుతోందిట. ఇలా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు రాకపోతే ఎట్టా అన్జెప్పి, ప్రభుత్వమే స్కూళ్ళన్నిటిని ఇంగ్లీషు మీడియంలోకి మార్చేస్తోందిట. ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత, తెలుగు పేపర్లు, తెలుగు సినిమాలు, పుస్తకాలు, తెలుగు ఛానెల్సూ అన్నీ మూసేసుకోవచ్చు. తెలుగుని వినియోగించుకునే మార్కెట్టు పెద్దగా ఉండదు గాబట్టి, గవర్నెమెంటిచ్చే ప్రకటనలకి కక్కుర్తి పడి వెయ్యి ప్రతులుతోనే తెలుగు దిన పత్రికలుగా చెలామణీ ఔతున్న కొన్ని వందల దినపత్రికల్లా, ఏవో చిన్నా చితకా వ్యాపారాలు చేసుకోవచ్చు.

ఇప్పుడు వెతికి చూశాను. కాస్త కుదుట పడ్డాను. కానీ ఇప్పటికీ ఈ వార్త కొంచెం కలత చెందించేదే.
http://righttoeducation.in/media/andhra-pradesh-government-gives-english-push-primary-education-level

మొదట(పై పేరాలో) అనుకున్నట్టుగా మొత్తం ఇంగ్లీషు మీడియంకు మార్చటం లేదు. కేవలం ఇంగ్లీషుని సెకండ్ లాంగ్వేజ్‌గా, ప్రాథమిక స్థాయినించే, అంటే మొదటి తరగతి నుంచే నేర్పించటం ప్రారంభించనున్నారు. ఇంగ్లీషుకి ఇనిషియేట్ అవ్వటం వల్ల, అవకాశాలు అందుకోవటంలో కాస్త పరిస్థితి మెరుగ్గా ఉండవచ్చు. మంచిదే. కానీ, ప్రభుత్వ బళ్ళలో నమూదు సంఖ్య తగ్గిపోవటం, ఇంగ్లీషు బళ్ళకై ప్రజలు పరిగెట్టడం అనే అంశాలు అంత మంచి విషయాలు కాదు. ఇది ఇంకాస్త లోతుగా ఆలోచించి, పరిష్కారాలు కనుక్కోవలిసిన విషయాలు కదా.

ఏదైనాగానీ, ఏదో ప్రజలంతా ఒకటి కోరుకుంటున్నారు అన్జెప్పేసి, మనం దాన్ని ప్రోత్సహించం. సమాజానికి ఏది హితమో ఆలోచించి,, మేధావులు ఆ విధంగా నడిపించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు…

జ్యోతిష్యం అనే పేరుతో మోసాలు చేసేస్తున్నారని జెప్పి, తెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్యం కోర్సు బ్యాన్ చేసేయాలని ఉద్యమించారు కదా! ఏ?, ప్రజలు జ్యోతిష్యాన్ని ఇష్టపడ్డారుగా అని ఎందుకు వదిలేయటం లేదు?

ప్రజలు సెక్సు సినిమాలు చూడ్డానికి ఇష్టపడుతున్నారుగా అని, విచ్చలవిడిగా వాటిని ప్రదర్శించనియ్యడం లేదెందుకు? అరికట్టే మార్గాలు ఎందుకు తీసుకుంటున్నారు?? సినిమాలకి సెన్సారు బోర్డు ఎందుకు?

ప్రజలకి పైరేటెడ్ సినిమాలే ఇష్టంగా ఉన్నయ్ బయ్, మీ బిజినెస్ ఏమైతే మాకేంటి? ప్రజలు కోరుకున్నట్టు చెయ్యండని ఎందుకు అన్లేకపోతున్నాం?

చాలా అర్ధంపర్ధలేకుండా మాట్లాడుతున్నా కదూ!. యా…Anyway, the point i am trying to make is this:

ప్రజలు ఇంగ్లీషు కోరుకుంటున్నారు కదా అని మనం ఇంగ్లీషే నేర్పకూడదండి. ప్రజలు ఎందుకు ఇంగ్లీషుకి తరలి వెళ్తున్నారో తెలుసుకొని, ఆ అవసరాలు తెలుగులోసైతం తీరే మార్గం చూడాలి. తెలుగువల్ల అసమానతలు తగ్గగలిగే మార్గం చూడాలి. అంటే, ’తెలుగు చచ్చిపోకూడదు, తెలుగు భాషే మనకి తెలుగువారిగా గుర్తింపు నిస్తుంది. తెలుగువారనే గుర్తింపు ప్రజలకి అవసరం’ అని కొందరు మేధావులన్నా సరిగ్గా తెలుసుకోగలిగితే, వాళ్ళు తెలుగునీ, తెలుగు సమాజాన్ని నడిపిస్తారు. అంతేగానీ,  తెలుగులో పదాలు సృష్టించుకున్నంత మాత్రాన, తెలుగు బట్టగట్టదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది? తెలుగు వల్లే అసమానత వచ్చే ప్రమాదం కనిపిస్తోంది!

మరో పెద్దమనిషి చెప్తారు – బోధనా పద్దతి మారిస్తే,  పిల్లలు తెలుగు నేర్చుకుంటారు అని. ఇప్పుడేమైంది? ఇదేనా తమరు కోరుకున్న బోధనా పద్దతిలో మార్పు?

మొదట్నించీ మీరందరూ చెప్తున్నదే నేనూ చెప్తున్నా.  భాష భావ వ్యక్తీకరణకే, తెలుగు వాళ్ళు మాట్టాడుకోవడం వల్ల తెలుగు ఉంటుంది. ఒకే! కానీ, తెలుగు వాడికి తెలుగులో మాట్టాడే అవసరం కూడా ఉండని పరిస్థితి వస్తే!? రాదు అనకండి.

ఈ మార్నింగ్ నేను వేక్ అప్ అయ్యాక, , జాగింగ్ చేసి, ఫ్లాట్ కెళ్ళి,  మిల్క్‌తో కార్న్ ఫ్లేక్సు తీసుకొని, యాక్స్ ఎఫెక్టుతో క్విక్ బాత్ చేసేసి, కారు డ్రైవ్ చేసుకుంటూ, ఆఫీసుకొచ్చేసరికి లేటయిపోయిందని మా లేడీబాస్ పెద్ద లెక్చరిచ్చింది. నేను లైట్ తీసుకునేవాడినే కానీ, ఈ సారి కొంచెం స్ట్రాంగ్ డోసివ్వడంతో , ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ ఐపోయి, కాఫీడేలో కూర్చొని, నా ల్యాప్ టాప్ తీసుకొని వర్క్ చేస్తుంటే, అది కాస్తా క్రాష్ అయ్యింది….

…..మన భాష ఇలాగే కంటిన్యూ ఐపోతుంది. ఇదంతా తెలుగే!  పైగా ఇలాంటి తెలుగు వాళ్ళకి విద్యార్ధి దశలో ఇంగీషునేర్పటం కోసం, చేతన్ భగత్ రైట్ చేసిన బుక్స్‌ని , గవర్నెమెంటు ఫ్రీగా ఇచ్చేట్టు ఎరేంజ్ చేద్దాం. ఏమంటారు!?

ఇదంతా తప్పండి. చివరికి ఏ ఊరి జనాలవల్ల  తెలుగు బతికేస్తుందని ఢంకా బజాయించి చెప్పారో, ఆ ఊళ్ళో జనాలకీ ఇది తిండి పెట్టకపోతే, వాళ్ళూ ఇంగ్లీషులోనే ఏరుకుంటారు.

పోనీ వేరేలా మార్చి చెప్పుకుందాం. తెలుగు ’వాడకం’ వల్ల తెలుగు ఉంటుంది. మరి ఎందుకు తెలుగు వాడకం పెరుగుతుంది? డబ్బొస్తే పెరుగుతుంది. అది నిజమే కావచ్చు. కానీ, డబ్బెలా పుడుతుంది? ఐడియాల వల్ల పుడుతుంది.  సరే ఈ కనెక్శన్ కూడా ఇప్పుడు సరిగ్గా కుదరదు. మరొక్కసారి ప్రయత్నిస్తాను.

తెలుగు వాడకం ఎలా పెరుగుతుంది? తెలుగులో కూడా అన్ని విషయాలు దొరుకుతాయన్న ’నమ్మకం’ వల్ల పెరుగుతుంది. నమ్మకమే కాదు – అన్ని విషయాలు దొరకడం వల్లే పెరుగుతుంది. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, విషయసేకరణ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, వార్తలు కావచ్చు, పత్రికలు కావచ్చు, నవళ్ళు కావచ్చు, శాస్త్ర దృక్పదాలు కావచ్చు, సేవలు కావచ్చు… ఏదైనాగానీ, తెలుగులో విషయం దొరుకుతుంది అన్న స్థితిని కల్పిస్తే, ’ఇంగ్లీషుకి వెళ్తేగానీ మనుగడ లేద’న్న భయాన్ని/స్థితిని తొలగిస్తే, అప్పుడు ప్రజల్లో తెలుగు వాడకం నిలుస్తుంది/ పెరుగు తుంది.

దీనికి ప్రభుత్వమేదో చెయ్యలన్న దానికన్నా, మనం తెలుగువాళ్ళుగా ఏం చేసుకున్నాం అన్నది పెద్ద ప్రశ్న. ఉదా: దివాకర్ బస్సు సర్వీసు సైటు చూడండి. వీడు తెలుగు వాడేనేమో! ఉగాది శుభాకాంక్షలు అని మాత్రం తెలుగులో పెట్టాడు. ఈ సైటువాడు, తన బుకింగ్ సర్వీసుని ఇండియాలో అన్ని చోట్లా ఇస్తాడు గాబట్టి,దాన్ని ఇంగ్లీషులోనే పెట్టుకుంటాడు. కానీ, కనీసం తెలుగువారికై, తెలుగులో ఆప్షన్స్ చూపించడం వల్ల, తెలుగు నేర్చుకున్న పిల్లవాడికి సైతం దీని వాడటం వచ్చేసి, కొంతలో కొంత ఓ ఉద్యోగ అవకాశం వస్తుంది. Ofcourse, I am also aware that  ఇది ఏ భాషలో ఉన్నా, ఆ పిల్లవాడు నిరక్ష్యరాస్యుడైనా, ఒకసారి నేర్పితే అల్లుకుపోయే పిల్లవాడైతే, వాడు భాషతో సంబంధంలేకుండా పని చేసుకుపోతాడు. కాబట్టి, ఈ ఒక్క ఐడియా పట్టుకొని, నా పీకనొక్కద్దు. Get the general idea. మనం ఇచ్చే అన్ని సర్వీసులనీ, ఏదో విధంగా తెలుగులో చూపించే ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎన్విరాన్మెంటులో మార్పు వస్తుంది.

కానీ ఒక్కసారి మనం ఇంగ్లీషులోకి అలవాటుపడ్డ తర్వాత, మళ్ళా వాటిని తిరిగి తెలుగులో చేయించడం, బ్రహ్మతరం కూడా కాదు. That would be going  retro. You might be even seen as a fanatic then!.

ఇంకా బ్రాడ్‌గా చెప్తే, తెలుగులో ఆలోచనలు సాగాలి. దానివల్ల, తెలుగు వాడకం నిలుస్తుంది. ఇవ్వాళ్టికి ఇంతటితో ఆపేస్తాను. మళ్ళా రేపో మాపో మళ్ళీ వస్తాను.

కానీ ఇలా తెలుగుని చావనివ్వకండి ప్లీజ్. ఛస్తే ఏ? అంటే, నిజానికి ఏమీ లేదు. నేను మీలాగే అవకాశవాదినే. ఇంకేదో అవకాశం చూసుకొని ముందుకెళతానేగానీ, దీన్ని కాపాడుతూ చచ్చిపోను. నేను బతకటం ఇంకా ముఖ్యం.

అన్నట్టు, తెలుగు భాషకీ,  ఉగాదికీ సంబధం లేదేమో. తెలుగువారేకాదు, ఎక్కువమంది కన్నడిగులు కూడా, చాంద్రమానాన్ని వాడుకుంటారు. ఇది అలా ఓ సంవత్సరాది. ఊరకనే, జనవరి ఫస్టుకి భిన్నంగా ఉండటం కోసం, దీన్నితెలుగు సంవత్సరాది అన్నాం. [తెలంగాణా సంవత్సరాది అని ఇంకోటి తయారు చేసుకోనక్కర్లేదనుకుంటాను. ఇది కన్నడ సంవత్సరాది కూడా. మళ్ళీ అందులోనూ, మాంగళూర్ ప్రాంత ప్రజల్లో సౌరమానం ఎక్కువ వాడుకలో ఉండటం కద్దు. వాళ్ళు ఏప్రెల్ 14గో ఎప్పుడో చేసుకుంటారట]

ఉగాది శుభాకాంక్షలతో

మీ

రేరాజ్

“యస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆ ఋషులకంటే గొప్పవాడా?”

సమర్పింపబడినది మార్చి 22, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

జార్జ్ బుష్ వల్లే అరబ్ విప్లవం వచ్చింది ట.

పోయిన డిసెంబరులో, ట్యునీషియాలో, ఓ పళ్ళమ్ముకునేవాడు ఆత్మాహుతి చేసుకున్నాడు. ఎందుకు? పని లేక. ఔను. నిజంగానే పని దొరక్క. మరో పక్క స్ధానిక అధికారులు వేధింపులు కూడా తోడయ్యాయి. అలా వాడు ఒంటికి పెట్టుకున్న నిప్పు, ఆ దేశంలో ఓ విప్లవాన్ని వెలిగించింది. అక్కడి ప్రెసిడెంటును పడగొట్టింది. అంతే, విప్లవజ్వాలలు దావాలనంలా పాకి, అరబ్బు దేశాల్లోని నియంతృత్వలైతేనేమీ, మోనార్కీలైతేనేమీ , అన్నింటికీ నిప్పెట్టింది

ఈ పరిణామం చైనీసు ప్రభుత్వాన్ని కూడా భయపెట్టింది ట. ఈ అరబ్ విప్లవం, సడన్‌గా వచ్చిన ఓ అనూహ్య పరిణామం – సోవియట్ యూనియన్ పతనంలా , తూర్పు ఐరోపాలోని కమ్మ్యునిస్టు పతనంలా, బెర్లిన్ గోడ పతనంలా.

మనం చూస్తున్న ఈ పరిణామాలకి కర్తగా, ఒక వ్యక్తి మాత్రం గర్వించవచ్చున ట – అమెరికా భూత్‌పూర్వ్ రాష్ట్రపతి – జార్చ్ బుష్ (jr) . కనీసం బుష్ బుద్దిపూర్వకంగా  వేలెట్టకపోయినా, మొత్తానికి వారి కెలుకుడి వల్లే , అరబ్బు లోకం అంతా ప్రజాస్వామ్య  పంథావైపు పయనించేస్తోందని,  వారికి రెండు వీరతాళ్ళెయ్యమంటున్నారు. ఎవరు?

మెట్టమొదట ఈ మాట అన్నవాళ్ళల్లో The Economist (February 5) ఉంది ట. The Economist wrote: “The Americans leant on Egypt to hold more open elections in 2005, and in 2006 they talked an astonished Israel into letting Hamas contest Palestinian elections in the occupied territories. Even the Saudis were prevailed on to hold some (men only) local elections. All this was based on a particular theory, the post 9/11 neoconservative conclusion that the root cause of terrorism was the absence of Arab democracy.”

పై వ్యాఖ్య కరెక్టేఐనా, ఆఫ్గనిస్థాన్లోనూ, ఇరాఖ్‌లోనూ బుష్‌గారి కెలుకుడి కార్యక్రమాలు అందులో కనపడట్లేదు. ముందు వీటిని తీవ్రవాదానికి ఆశ్రయమిచ్చిన దేశాలుగానే భావించిన బుష్‌గారు, క్రమంగా అక్కడి ప్రభుత్వాలను కూలదోసి, ప్రజాస్వామిక ప్రభుత్వాలను నెలకొల్పాల్సిన అవసరాన్ని గ్రహించాడు.  ఇక అక్కడ్నించి, ఆ దేశ ప్రజల్లో  ప్రజాస్వామ్య ఆకాంక్షని పెంపొందించే ప్రయత్నాలు మొదలెట్టాడుట. ఈ విషయం పై, బుష్ ఆలోచనలోని క్లారిటీని, నిబద్ధతని  ఎరుగనేని, వారి  “డెసిషన్ పాయింట్స్(Decision Points)” అనే  మెమోయిర్స్ (స్మృతులు) చదువవలసిందిగా చెబ్తున్నారు. ‘Freedom Agenda’ అనే పేరుతో, ఈ విషయంపై ఓ చాప్టరే కేటాయించాడట.

బుష్ ప్రభుత్వహయాంలో జరిగిన 9/11 ఘటన,  ఆయన మొదటి టర్ములో ఓ నిర్ణయాత్మక క్షణం. అది అతన్ని చాలా బాధపెట్టి ఆలోచనకు పురిగొల్పింది. అమెరికాకు పొంచివున్న తీవ్రవాద భయాన్ని ఎలా తుదముట్టించాలని తీవ్రంగా ఆలోచించి , తన బుష్ డాక్ట్రిన్‌తో బయటొకొచ్చాడు. అందులో నాలుగు భాగాలున్నాయి.  మొదటిది – తీవ్రవాదులనీ , తీవ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశాలనీ విడివిడిగా చూడకుండా, ఒకటిగానే పరిగణించటం. రెండోది – యుద్దాన్ని శత్రువు గడపదగ్గరకి  తీసుకెళ్ళటం. మూడోది – తీవ్రవాదచర్యలు రూపొందక ముందే, మొగ్గలోనే తుంచేయటం. నాలుగవది –  advance liberty . ఇది ‘freedom agenda’.

ఇదేదో రాత్రికి రాత్రి బుష్ రాసుకున్న ఆలోచన కాదు. ఆఫ్‌ఘనిస్థాన్‌లోనూ , ఇరాక్ లోనూ తను మొదలెట్టిన కెలుకుడు కార్యక్రమాల వల్ల, తనలో మెల్లిగా తలయెత్తిన ఆలోచనలు, రెండో విడత ప్రమాణస్వీకర సమయానికి, ధృడనిశ్చయంగా పరిణమించాయి.

2001 చరమాంకంలో, ఆఫ్‌ఘనిస్ధాన్‌ని ముట్టడించిన రోజు, అల్ ఖైదా తీవ్రవాదానికి స్వర్గధామంగా నిలుస్తున్న ఓ ప్రభుత్వ హయాంను కూలదోస్తున్నట్టు మాత్రమే బుష్ భావించాడు. కానీ, ఎప్పుడైతే, 2004లో ఆఫ్‌ఘనిస్ధాన్ తన మొదటి  ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌ని నిర్వహించిందో, అప్పుడు బుష్‌లో ఆశ చిగురించింది. ఇరాక్ విషయంలో, నియంతృత్వ స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పే ప్రణాలిక, అంతకు ముందు నుంచే ఉన్నది.

రెండో విడత ప్రారంభోపన్యాసంలో, తను ఈ ఎజండాతో ముందుకెళుతున్నట్టు స్పష్టం చేశాడు:  “The survival of liberty in our land increasingly depends on the success of liberty in other lands.So it is the policy of the United States to seek and support the growth of democratic movements and institutions in every nation and culture, with the ultimate goal of ending tyranny in our world.”

మొత్తంగా తెలుగులోకి అనువదించలేకపోతున్నాగానీ, “మనదేశంలో స్వేచ్చాయుత జీవనం ఉండాలంటే, సుఖశాంతులు వర్దిల్లాలంటే, ఇతర దేశాల్లోనూ అవి ఉండాలి. అందుచేత, ప్రతి దేశంలో, ప్రజాస్వామ్య ఉద్యమాలని పెంపొందించి, ప్రపంచంలో టిరన్నీని అంతం చేద్దాం”. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం: తనదేశంలో స్వేచ్చాయుత జీవనం ఉండాలంటే, సుఖశాంతులు వర్దిల్లాలంటే, ఇతర దేశాల్లోనూ అవి ఉండాలి.

ప్రతిదేశంలోని అటోక్రటిక్ ప్రభుత్వాలని, బలంతో కూలదోయటం సాధ్యం కాదు. అందుకొని ఒక బహుముఖ ప్రణాలికతో ముందుకెళ్ళారు. పాలెస్టీన్ ప్రాంతాలలో, లెబనాన్, జార్జియా, ఉక్రైన్‌లలో మొగ్గతొడుగుతున్న ప్రజాస్వామ్యాలకీ మద్దతిచ్చారు. ఇరాన్, సిరియా, నార్త్ కొరియా, వెనిజుయెలా లాంటి చోట్ల అసమ్మతి వాదులనూ, ప్రజాస్వామ్యమార్గంలోని సంస్కర్తలను ప్రోత్సహించారు. సౌదీ అరేబియా, ఈజిప్ట్, రష్యా, చైనాలాంటి చోట్ల, మరింత మర్యాదగా స్వేచ్చని ప్రోత్సహించారు.

చాలా మంది ఈ అప్రోచ్‌ని, స్వలాభాపేక్షగా, అవకాశవాదంగానే భావించారు. అభివర్ణించారు. ఆ ముసుగులో అమెరికా తన ప్రపంచాధిపత్యానికై ప్రయత్నిస్తోందని కూడా అనుకున్నారు. దానికి ఉదాహరణగా  ఆఫ్‌ఘనిస్థాన్‌లోనూ, ఇరాక్‌లోనూ జరిగిన మారణహోమాన్ని చూపిస్తారు. సౌదీ అరేబియా లాంటి దేశాలలోగాక, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రథమ అభ్యర్ధిత్వం ఇరాక్‌కే ఎందుకు యిచ్చారో తేల్చమన్నారు. ఇరాక్ యుద్ధం, అమెరికాకు అరబ్ దేశాలతో ఉన్న సంబంధాలని విషపూరితం చేశాయి. ఒకవేళ, ప్రజాస్వామ్య బద్ధంగానే, అమెరికాని వ్యతిరేకించే ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా ఉంటే, అమెరికా ఇంత లావున ఈ ప్రజాస్వామ్య ప్రోత్సాహాలనిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.

అవన్నీ నిజమే కావచ్చు ; కానీ, అఫ్‌ఘనిస్థాన్‌లోనూ , ఇరాక్‌లోనూ ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఎన్నిక, అరబ్ ప్రపంచంలో ఒక బలవంతమైన ప్రభావాన్ని చూపగలిగాయన్న విషయాన్ని మరవకూడదు. దీనివల్ల, ఎంతో కొంత సామరస్య ప్రభుత్వాలు, కొంత అభివృద్ది కలిగిన దేశాల్లో సైతం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకై కాంక్షని పురిగొల్పింది. ప్రజాస్వామ్య పంధావైపు మొదలైన ఈ పయనాన్ని, ఇక ఆపతరం ఎవ్వరివల్లా కాదు.  

బుష్ విధానం కూడా, రోనాళ్డ్ రీగన్‌లా,  చాలా సింప్లిస్టిక్‌గా కనపడి ఉండొచ్చు. లిబరల్ మీడియా, బుష్‌ని ఓ మూర్ఖుడిగా చిత్రించి ఉండొచ్చు. కానీ, రీగన్‌ విషయంలో మల్లేనే, బుష్‌ని కూడా  తక్కువ అంచనా వేశారు. ఓ సమర్ధ నాయకుడి ఇన్స్టింక్ట్స్, మేధావులందరినీ తప్పుగా నిరూపించడం ఇదేమీ మొదటిసారిగాదు. బుష్ ప్రెసెడెన్సీకి, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడమనే అంశం ఎలా ఓ కీలకమైన కేంద్రకమో ఒక్కసారి అర్ధంచేసుకోగలిగితే, ఆయన దృష్టిలో అమెరికాకి భారతదేశం ఎలా ఒక సహజ మిత్రదేశమయ్యిందో కూడా అర్ధంచేసుకోగలం. అణుఒప్పందం కోసం, అమెరికా ఎందుకంత వ్య యప్రయాసలకోర్చిందో కూడా వివరించగలుగుతాం.

దీని నుంచి వచ్చే మరో పర్యవసానం ఏంటంటే, ఇండో-చైనా లని పోల్చి చూసుకుంటున్నప్పుడు, ఇండియా కాస్త మెరుగ్గా కనపడతుంది. అంటే, అభివృద్దిలో చైనాని దాటివెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వృద్దిరేటుకాదుగానీ,  ఏ ఏకపార్టీ ప్రభుత్వమైతే చైనా ఎదుగుదలకి కారణంగా భావిస్తున్నామో, సరిగ్గా అదే ఇప్పుడు ఈ అరబ్ ప్రపంచంలోని ఉద్యమాలవల్ల చాలా వల్నరబుల్‌గా కనపడుతోంది. India’s bumbling democracy looks better in comparison. The old arguments lose their shine once democracy is seen as a non-negotiable good.

హమ్మయ్య : ఇక్కడికి  ETలోని  ఈ వ్యాసాన్ని  ఎలాగోలా చెప్పగలిగాను అనుకుంటున్నా.

ఉఫ్. సరే, ఇక నా విషయానికొద్దాం. ఈ ప్రయత్నమంతా, నాకేదో ప్రపంచం రాజకీయల మీద సూపర్ అవగాహన ఉందని కాదు. ఆ మాటకొస్తే, అంత ఆసక్తి ఉందనీ గాదు. ఎటొచ్చీ, ఎవడో ఒళ్ళు తగలేసుకున్నాడనగానే, దాంతోనే విప్లవం వచ్చేసిందనుకునే అమాయక జనం కోసం; వాళ్ళాకీ మరో కోణం ఇవ్వటం ఓ చిన్నపాటి లక్ష్యం.

సరే, ఆ విషయాలన్నీ తెలిసినా, తెలీకపోయినా,  ఇన్నాక మనం చెప్పుకున్న ముఖ్య విషయం : తనదేశంలో  స్వేచ్చాయుత జీవనం ఉండాలంటే, సుఖశాంతులు వర్దిల్లాలంటే, ఇతర దేశాల్లోనూ అవి ఉండాలి అన్న ఆలోచన.

అయ్యా  “సర్వేజనా సుఖినో భవంతు” అని ఎందుకంటామో తెలుసా? సరిగ్గా ఇందుకే. ఎవ్వడు సుఖంగా లేకపోయినా, మన సుఖం కూడా దొబ్బిపోద్ది. అందుచేత, అందరూ సుఖంగా ఉండేలా చూడటం ప్రతివాడి కర్తవ్యం.

మన బాలూకీ, కాస్త అతి తెలివెక్కువ. లోకంలో చెడ్డాళ్ళు కూడా సుఖపడితే ఎట్టా? అనుకొని, ఆ ఋషి వాక్యాన్ని రెండుగా విడగొట్టాడు. సర్వే జనా సుజనో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు అని. కానీ, ఏది సు? ఏదు దు? I mean,  ఏది మంచి? ఏది చెడు? ఎవరు సుజనులు? ఎవరు దుర్జనులు? ఎవరు నిర్ణయించగలరు?అది చాలా పెద్ద విషయం కదా! కేవలం ఋషులు మాత్రమే నిర్ణయించగలరు కదా! వాళ్ళకింకా ఎక్కువ విషయం తెలుసుగాబట్టే, అందరూ సుఖంగానే ఉండాలని కోరుకున్నారు. ఎవ్వడు సుఖంగా లేకపోయినా,పక్కనోడి సుఖానికి వాడు చేటు అన్న విషయం సంపూర్తిగా ఎరిగినవారు కాబట్టి.

To put it in the orthodox fashion,  “వాళ్ళని ఖండిచటానికి, బాలూ ఆ ఋషులకంటే గొప్పవాడా!? ”         :))

————————————————-

Offtrack: అసలు విషయం ఇంకోటి చెబితే, అందరూ గుంజుకోలేక ఇరుక్కుపోతారు. సదరు పళ్ళవ్యాపారి నిజానికి  ఆత్మహుతి చేసుకున్నది, అవమానం తట్టుకోలేక. రోజూ ఏదో ఓ పోలీసుతో గొడవపడటం తప్పని అక్కడి పరిస్థితుల్లో ఉన్న ఈ కుర్రవాడిని, ఆ రోజు ఓ లేడి పోలీసు చాచి లెంపకాయ కొట్టింది.  దాంతో ఏం చెయ్యాలో తెలీక, పై ఆఫీసరు దగ్గరికి వెళితే, వాడు వినలేదు. అప్పుడు ఒంటికి నిప్పంటించుకున్నాడు.

http://english.aljazeera.net/indepth/features/2011/01/201111684242518839.html

మిగితాది నే కెలకలేను. ఎందుకంటే, ఆడది కొట్టిందని ఆత్మాహుతి చేసుకున్నా, నేను తేలిగ్గా తీసిపడెయ్యలేను.

తింగరి వెధవల్లారా.. ఈ జాతిద్రోహులే మీకు కరెక్టు.

సమర్పింపబడినది మార్చి 15, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

చాలా నిర్దిష్టంగానే చెప్తున్న పోస్టు. ఐనా అర్ధంగాకపోయినా /  చేసుకునే సహనం పోయినా, సైలెంటుగా దొబ్బెయ్యచ్చు.
_______________________

ఒక్కొక్క సింబల్‌ని పిడిగుద్దులతో పిండి పిండి చేసి, దాని వెనుక దాగున్న నిజాన్ని, సింబల్సు సృష్టించిన మేధావుల లక్ష్యాన్ని చూపించి, మన మట్టి బుర్రలో ఆలోచన మొలకత్తెంచాలని ప్రయత్నిస్తుంటే, మీకు ఆవేశమే వస్తోంది తప్ప, ఆలోచనలు పుట్టట్లేదు. ఎందుకూ మన చదువులన్నీ? చంకనాకినికా?

ఇవ్వాళ్ళ నిజంగానే బద్దలు గొట్టారు. పిరికి వెధవల్లారా, ఏం పీకుతార్రా?  “తెలుగుజాతి ఐక్యత కోసం ప్రాణాలిస్తామ”ని వెళ్ళి ఒంటిమీద పెట్రోలు పోసుకొని తగలేసుకోగల్రా? మీరు వెనుకంజ వేస్తోంది అందులోని ఉన్మాదాన్ని చూసి కాదు. మీ పిరికితనం వల్ల. మీకే గనక బుర్రలుంటే, వాటిని నేను సింబాలిక్‌గా పడగొడ్తున్న ప్రతి రోజూ, ఏం చెయ్యాలో ఆలోచించేవాళ్ళు.

సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే, పోయి ఆత్మహుతి చేసుకొని చూపించండి. ’తెలుగుజాతి’ ఐక్యత కోసం తెలంగాణ ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆత్మత్యాగం చేసి చూపించండి.
______________________

ఔను. ఇది రాజకీయ కుట్రే కావచ్చు. ఐతే, ఎగస్ పార్టీ  బుర్రేం దొబ్బింది?  సరే. ఏదైనాగానీ, ప్రస్తుత రాజకీయాలకి  యూనిఫికేషన్ రోజులు కాదు. నా దృష్టిలో ఇంకా డివిజివ్ పాలిటిక్స్ నడుస్తాయి. అందుకే చెప్తునే ఉన్నాను.

డైవర్సిటీని రాజకీయం నడిపిస్తే,  యూనిటీని మేధావులు నిలబెట్టాలి అని.
____________________

తెలంగాణావాదులొచ్చి దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం అంటూ చెప్పకండి ప్లీజ్. ఎలాగూ మన జాతి వేరు, మన తల్లి వేరు, మన భాష వేరు అంటూ, మన  విశష్టితని పెంచుకుంటున్నాం  అనుకుంటూ ద్వేషంతో, అతి తెలివితో జీవించే నిర్ణయం తీసేసుకున్నాం గనక, ఏమీ ఖండించక్కర్లేదు. ఈ దేశంలో రౌడీయిజమూ, వాండలిజమూ ఇవే రాజకీయ ఆధిపత్యానికి మార్గాలు. గాంధీ కూడా అదే నిజం అని రుజువౌతున్నట్టు గ్రహించిన రోజు, నలిగి నలిగి ఇక నా వల్లకాదు తీసుకుపొమ్మని దేవుణ్ణి వేడుకుంటే, నాధూ రాం God  सॆ వచ్చి, delivered him out of his pain.   మొన్న మస్జీదు పగలగొట్టిన రోజూ ఈ దేశ ప్రజ నిరూపించింది అదే. మనం ఓర్వలేని సింబల్స్‌ని మనం పగలగొడతాం. అలా, మన ఆధిపత్యాన్ని నిరూపిస్తాం.

సప్పోజు రేపు తెలంగాణ బొమ్మలే అక్కడ పెట్టాం. ఎళ్ళుండి ఆంధ్రా వాళ్ళు పడగొట్టారు. అప్పుడు ఎలా ఫీలవుతారు? లేదండీ – ఆంధ్రలో ఉన్న ఏ పోతన బొమ్మనో, తెలంగాణవాడని చెప్పి పగలగొడితే ఎలా ఉంటుంది? ఐనా, ఇవ్వన్నీ తెలీక చేశారన్నట్టు నేను మాట్లాడటం నా మూర్ఖత్వం.

కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ కోశానైనా మీరూ తెలుగు వారే నన్న గ్రహింపు మీకుంటే, మీరు తెలుగువారేనన్న భావన మీకుంటే,  ఇదంతా “తెలుగుజాతి ద్రోహ”మని మాత్రం మరువద్దు. మరో రకంగా ఇదంతా దేశద్రోహం. కానీ, అదంతా, మీకు ఓ దేశాభినం అంటే ఏంటో తెలిస్తే మాత్రమే అర్ధమౌతుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ జాతిగా విశిష్టులౌతున్నాం అనుకున్నాంగా, ముందు ముందు తెలుసుకుంటాం.

_______________________

అడుగుతున్నదేంటి? ప్రత్యేక రాష్ట్రం. అంటే, ఇది రాజకీయ విషయమే! అది నాకున్న క్లారిటీ. రాజకీయలు మాట్లాడ్డం నాకిష్టం లేదు. నేను రాజకీయం చెయ్యను. తెలంగాణా సమస్యలేవైనా కావచ్చు, మాట్లాడుతోంది, అర్ధిస్తున్నదీ, పోరాడుతున్నది ఓ రాజకీయ పరిష్కారాన్ని సాధించటానికే. అందుకని ఈ విషయాల్లో తలదూర్చను. కానీ, ఇది రాజకీయాలకతీతంగా ఏదో మారిపోయిందన్నారుగా! విద్యారుర్ధులేదో ముందుకొచ్చారు వీరతిలకాలు దిద్దుకొని అన్నారుగా! అందుకని నోరెత్తాను. అంతే కాదు, ఇప్పుడు బద్దలు కొట్టింది ’తెలంగాణ రాజకీయవాదులు’ కాదు ట – అల్లరిమూక ట. ఆందోళన కారులు ట. మీడియా ఇమ్మిడియేట్‌గా మార్చి చెప్పిన పదం అది. అందుకని నోరెత్తాను. ఇది జాతి ద్రోహమని.
_____________________________

 ఔను మరి! ఆశయం కోసం జీవించనదీ  ఓ జీవితమేనా? అందుకే పిలుపునిస్తున్నాను. తెలుగు జాతి ఐక్యతకోసం ఆత్మహుతిలివ్వండి అని.

ఇంతకుముందెప్పుడూ ఇలాంటి ఫనెటిక్ భాష నేను వాడలేదు మరి!కానీ, తెలిసుకున్నాను నాయనా! “ఆశయాలకోసం పోరాడేటప్పుడు ఫలాల్ని ఆశించరు. ఫలితం సిద్ధిస్తుందనే నమ్మకంతో పోరాడతారు.” అని.

మన దగ్గర “థాట్ ప్రొవోకింగ్” ప్రశ్నలే కాదు బాబు. శ్రీకృష్టుడంతా ఫిలాసఫీయే ఉంది – philosophers of the ‘selfless action’. Even when the very question is about ‘regionalism’, we support all ‘selfless’ creatures to kill themselves irrespective of   ‘ప్రాంతీయత’. We beleive in active participation in socio-political action. Wow! చచ్చేదెవరూ? చంపేదెవరూ? కానీండి. జనాలు ఛస్తుంటే, వారి వీరత్వానికి, త్యాగనిరతికి, జోహార్లర్పిద్దాం. స్థూపాలు కట్టి, భవిష్యత్తులోనూ ఇలాగే ఇంకా చచ్చేవాళ్ళను తయారు చెయ్యడానికి సింబల్స్ సృష్టిద్దాం. కవిత్వం వచ్చుగాబట్టి, కవితలు కూడా రాద్దాం.

ఒకవేళ ఎవరైనా చరిత్రలో ’ఇది తప్పురా’ అని చెప్పుంటే, వాడిని మాత్రం సెక్సు స్కాండల్స్‌లో ఇరికిద్దాం. వాడి వ్యక్తిత్వానికి స్వార్ధాన్ని అంటగటదాం. చివరికి, ఇలాంటి ఉద్యమ ఉన్మాదంలోనే వాడిని ఎవరైనా హత్యజేసినా, ఆ ఉన్మాదాన్ని, ఉద్యమ స్ఫూర్తిగానే తీసుకుందాం. అంతేగానీ, ఇలాంటి ఆత్మార్పణ తప్పు అని మనం చెప్పం. ఏది తప్పు? ఏది ఒప్పు? ఎవడు నిర్ణయించగలడు? భావజాల యుద్ధాలు చేస్తూనే, రాజకీయంలో రక్తపాతం లేకుండా, just మనుషల ప్రాణాలు మాత్రం ధారపోద్దాం.  ప్రాణత్యాగం చేయలేని జీవితమూ ఓ జీవితమేనా? ప్రాణత్యాగం లేని ఓ ఉద్యమమూ ఉద్యమమేనా!?

ఫలితాలతో, ఉజ్వల భవిష్యత్‌తో సంబంధం లేకుండా, చావండి. ఫలితాల సంగతి మేం చూసుకుంటాం.
_______________________________

భావావేశంలో ప్రాణాలిచ్చేసిన ఎందరో దేశభక్తుల పేర్లు నిజానికి ఎవ్వరికీ గుర్తులెవ్వు. కాదు. అసలు మనకు తెలియదు. ఎందుకంటే, ఆ ’గుర్తింపు’ ఎందుకు కావాలోకూడా ఆలోచించుకోని అమాయక నిస్వార్ధ భావావేశం వాళ్ళది.

’ఆలోచించి’, నిస్వార్ధంగా ‘జీవించండి’. ఫలితం ’ఆశిం’చ కుండా చావద్దు. ’ఆశయ’సాధనకై జీవించండి. ఇందులో సందిగ్దతకి తావు లేదు.’చావు’యుద్దాలు ప్రోత్సహించకండి.
___________________________________
ఏది తప్పు? ఏది ఒప్పు? ఎవడు నిర్ణయించగలడు? అవి చాలా పెద్ద మాటలు కదండీ! కేవలం ఋషులు మాత్రమే దాన్ని చెప్పగలరు. నిజం!

అహంకారాన్ని, అనవసర అయోమయాన్ని తగ్గించుకుంటే ఇక్కడున్న వాళ్ళమే ఋషులైపొతాం.ఈ కాలనికి నిర్ణయించగలం. రాజకీయ వేర్పాటుకై , జాతిని విడగొట్టాల్సిన అవసరం లేదు.
_____________________________

తెలంగాణాలో ఆలోచించటం వాడుకలో లేదు అన్న మీ వాక్యమే చెబ్తుంది, మీ దురంహకారాన్ని. ఇక మీరేం ఆలోచించగలరు? మీకీ శాస్తి జరగాల్సిందే.

ఒకప్పుడు “అందరికీ ఉన్నత విద్య అవసరం లేదు. ఇస్త్రీ చేసుకొని బతకడానికి ఉన్నత విద్య ఎందుకు? పైగా దీని వల్ల ఉన్నత విద్య యొక్క విలువ దెబ్బ తింటుంది”, “అసలు ఉన్నత విద్యని తెలుగులో చెప్పుకోవాల్సిన అవసరం లేదు” అన్నంత దురంహంకార ఉపదేశాలుండేవి. ఆ అహంకారాన్నించి మీరింకా బయటికి రాలేదు. అందుకనే నే చెప్పేది మీకింకా అర్ధం కాలేదు.

ఎంత తిక్క శంకరయ్యలైనా, మీరు చెప్పేదాంట్లో కొంత నిజం ఉంది. దేశభక్తి, భాషాభిమానం అంటూ మనం ఎంత గుంజుకున్నా,  సగటు మనుష్యులందరికీ తినటం, దెం***౦, పడుకోటం ఇవే కావాలి. వేరేవేమైపోయినా ఏమీ పట్టదు.ఓహో తమరికి గ్రాంధీకంలో చెప్పాలి గావాల్ను. అదే, మీరన్న –  నిద్రాహార మైధునాలు.

కానీ, ప్రతి మనిషీ ఆలోచించగలడు. ఆలోచించగలగటం వల్లే మనం ఇలా  మనుష్యులం అయ్యాం. అది గుర్తించగలిగిననాడు, ప్రతి మనిషి సర్వయుగాల్లోనూ ఆలోచనపరుడే నని తెలుసుకుంటే, ’ఒకప్పుడు’ కాదు. ఇప్పటికి కూడా! అని తెలుసుకుంటారు. [Man is rational emotional spiritual animal]. ఆల్మోస్ట్ ఈ దగ్గరి కొచ్చి, ఎందుకోగానీ మళ్ళీ ఎటో జారిపోతుంటారు కొందరు.

అంతరాంతరాళాల్లో వెదకండి. It is just that our over reliance  and “రాగం” on ‘thought’ that makes us the thought-oriented-guys that we are, and also that which makes us hate (“ద్వేషం”) this ‘action’ of vandalism. 

All said and done, ఇప్పుడు బద్దలైంది మీ అభిమాన నటుడి రూపురేఖల్లోని బొమ్మలు మాత్రమే. ఏమీ మించిపోయింది లేదు.
___________________________________

’తెలుగు జాతి’ అనే Setలో,  తెలంగాణావాళ్ళూ ఉన్నారు. ’తెలుగు’ చరిత్రలో( ఆర్ధిక రాజకీయ సాంఘిక సాహిత్య సాంస్కృతిక చరిత్రలో)  ఆంధ్రుల ఆధిపత్యకాలం నచ్చినా  నచ్చకున్నా, దాన్ని తగలేసుకొనే ఆలోచనలు గానీ , పనులుగానీ చెయ్యటం మూర్ఖత్వం. ఈ మాటని ఇంతే నిర్దిష్టంగా, ఏ ఇతర (ఆధిపత్య)పోరాటాల గురించైనా  చెప్పగలను.

మరొక్క మాట: ప్రభుత్వం అమలు చేద్దాం అనుకున్న ఏ పరిపాలన ప్రణాలికనైనా వ్యతిరేకించి ఉద్యమించినప్పుడు, ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణిచివేయటానికే చూస్తుంది. అది ప్రభుత్వ కర్తవ్యం. ఎప్పుటి వరకూ ఈ అణిచివేత అమలులో ఉంటుంది? ఎప్పటివరకైతే తన పరిపాలనా ప్రణాలికని మార్చుకోదో / లేక తన ప్రణాలికని ఇక అమలు చెయ్యలేనని తేల్చుకుంటుందో అప్పటి వరకు. ఒక్క అణిచివేతే కాదు – తనకెదురయ్యే వ్యతిరిక్తతని ఎన్ని రకాలుగా రూపుమాపగలదో అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తుంది. పరిపాలన / అమలు కార్యంలో అది అనివార్యం. ఇది తెలియడానికి గొప్ప తెలివి తేటలక్కర్లేదు. మన నిత్య జీవితంలో, “అమలు” చెయ్యాల్సిన మన బాధ్యతలొచ్చినప్పుడు, మన ప్రవర్తననీ, ఆలోచనలనీ గమనించుకుంటే చాలు. అలాంటప్పుడు, ప్రభుత్వ అణిచివేతకి వ్యతిరేకంగా, ఇలా విశృంఖల స్వైరవిహారం జరిగింది అనటం అసమంజసం. ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయిందంతే అని దాన్ని జస్టిఫై చెయ్యాలని చూడటం, మరింత దిగుజారుడుతనం. 

బహుశా ప్రభుత్వాన్ని పలుమార్లు వైఫల్యం చెందనిస్తే, ఉద్యమం విజయం సాధిస్తుంది. నిజమే. కానీ, ఆ ప్రక్రియలో తెలుగుజాతి భావనకే విఘాతం కల్గించే ఆలోచనలు, ప్రవర్తన ఉద్భవించటం చాలా దురదృష్టకరం.

జస్టు ఓ రెండుమూడొందల మంది కలిసి మన దేశాన్ని పాలిస్తున్నారు. వీళ్ళందరూ ఓ 600 మంది చచ్చారుకదా అని నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళుకుంటాయి. ఆ సమీకరణాల వల్లే, కొత్త రాష్ట్రం ఏర్పడట్లేదు. ఇది ప్యూరుగా రాజకీయ సమస్య. ప్రజా సమస్య కాదు. ఐతే, భారతదేశ స్వాతంత్ర పోరాటం మాటో అంటారు కొందరు. ఔను. అది కూడా ప్యూరుగా రాజకీయ సమస్యే. కానీ, ఆనాటి రాజకీయం, వలసవాద దోపిడీ నుంచి బయట పడాలని చూసింది.ఆ వలసవాదం వల్లే, మన దేశ ఆర్ధిక పరిస్థితి (మరెన్నో దేశాల్లాగానే) కుంటు పడుతోందన్న సంపూర్ణ …What shall i say..comprehensive understanding కలిగి ఉంది. అప్పుడు కూడా, స్వంతంత్ర్యాన్ని వెంటనే రాజకీయ పరిష్కారంగా మేధావులందరూ అంగీకరించలేదు. సరే అదంతా ఒక ఎత్తు. ఏదేమైనా, ఆనాటి గాంధీయ వాద పోరాటంగానీ / ఇతర పోరాటాలు గానీ విజయం సాధించాయని మనం అనుకోవడం కూడా పూర్తిగా నిజం కాదు. కాస్త కాలం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడైనా అంతే.

ఇప్పుడు ఆంధ్ర వలసవాద దోపిడీ అంటూ, ఆంధ్రుల ఆధిపత్యాన్ని అభివర్ణించటం, అతి తెలివి. ఆధిపత్యం కోసం పోరాటం చెయ్యడం వేరు.దోపిడీ వేరు. తెలంగాణా సమస్యలకి కారణం – ఆంధ్రుల ఆధిపత్యమే అన్నది చాలా తప్పుడు వాదన; ఐనా ఓ పూర్తి  రాజకీయ వాదనగా, అంతవరకూ కూడా పోనీ ఒప్పుకోవచ్చు. కానీ, వాళ్ళు దోచుకెళ్ళారు అనే ఆర్దిక వాదన, అర్ధ రహితం. ఆంగ్లేయులు నిజంగానే దోచుకెళ్ళారు. వీటి మద్య భూమ్యాకాశలంత అంతరం ఉంది.

ఐతే, తెలంగాణా అభివృద్దికై, అవకాశాల పెరుగుగుదలకై, ఆంధ్ర ఆధిపత్యం నుంచి తప్పించుకొని ఓ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడదలుచుకున్నాం, అందుకని మా రాష్ట్రం మా కివ్వండి అన్న నిర్దిష్ట ప్రణాలికతో  ఉద్యమిస్తే, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం సులభ సాధ్యం ఔతుంది.

కావాలంటే ఒక్క విషయం గమనించండి. మన దేశభావజాలంలో,  రాజకీయంగా బ్రిటన్‌తో వేరుపడ్డా, వారి మీద అంత ద్వేషం లేదు.వాళ్ళ పెట్టుబడిదారీ దోపిడీ మీదకూడా ద్వేషం లేదు!!! కానీ, అనవసరంగా భరతజాతి భావనలో ఉన్న బీటలని ఆధారం చేసుకొని, విడగొట్టుకున్న పొరుగుదేశాలతోనే మనకి ద్వేషం. ఎందుకు? ’దేశం’ అనే రాజకీయభావనలో ’ద్వేషం’ నింపిన రాజకీయం జరిగింది కాబట్టి.

ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. గుర్తెరిగి – తెలుగుజాతి ఐక్యత చెక్కుచెదరని, రాజకీయ పోరాటాన్ని చేసుకోవడం, మనుష్యులుగా మనకు మంచిది. ఆలోచించండి.

ఎరెన్డ్ లీవ్ / ఆర్డినరీ లీవ్ / ఎన్‌క్యాషబుల్ లీవ్

సమర్పింపబడినది మార్చి 9, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

ప్రభుత్వోద్యోగాల్లోనూ, కొన్ని ఇతర ప్రభుత్వరంగ ఉద్యోగాల్లోనూ ఎరెన్డ్ లీవ్/ఆర్డినరీ లీవ్/ఎన్‌క్యాషబుల్ లీవ్ లాంటి పేర్లతో ఓ రకం లీవులుంటాయి. ఇలాంటి లీవులని పోగేసుకోనిస్తారు. పోగేసుకున్న వాటిని ఎన్‌క్యాష్ చేసుకోనిస్తారు. ఒక ఏడాదిలో వాడుకోగలిగే క్యాజువల్ లీవులలో సైతం, వాడుకోకుండా మురిగిపోబోతున్న కొన్ని లీవులని ఈ లీవులగా మార్చి, ఎక్యుములేట్ చేసుకోనిస్తారు. ఇలాంటి సంచిత లీవుల మొత్తం ఫలానా సంఖ్యకంటే మించకూడదు అని కూడా నిబంధన ఉంటుంది.కొంత అటుఇటూగా ఈ లీవుల విషయం ఇలా ఉంటుంది:

ఉదా ౧:
సంవత్సారాదిలో కొన్ని ‘ఆర్డినరీ/ఎన్‌క్యాషబుల్/ఎరెన్డ్ లీవులు ఇస్తారు. ఉదా. ప్రతి ‘పది’ పని దినాలకీ, ఒక ఎరన్డ్ లీవు చొప్పున, మొత్తం ఓ ముప్పై (30) లీవులిచ్చారు అనుకుందాం. ఇందులో మీరు 20 వాడుకోకుండా మిగుల్చుకున్నారు అనుకుందాం. అప్పుడు, వచ్చే ఏడాదికిచ్చే ముఫ్ఫైతో వీటిని జత చేసి, మొత్తం సంచిత ‘ఆర్డినరీ/ఎన్‌క్యాషబుల్/ఎరెన్డ్’ లీవులు యాభైగా చూపిస్తారు.

ఉదా ౨:
పై లీవులు కాక, మీకు ఏడాదికి ఓ 10 క్యాజువల్ లీవులు కూడా ఉన్నాయనుకోండి. అందులో మీరు ఐదు లీవులను, ఎక్యుములేట్ చేసుకోవచ్చు అనేది ఓ నిబంధన అనుకుందాం. ఐతే, మీరు రెండే లీవులు వాడుకొన్నారు. ఎనిమిది లీవులు వాడుకోలేదు. ఐనా, ఐదు లీవులనే ఎక్యుములేట్ చేసుకోనిస్తారు. మిగిలిన మూడు లీవులు మురిగిపోతాయన్నమాట. పై ఉదాహరణకే ఇది కొనసాగింపు అనుకుంటే, ఇప్పుడు సంచిత ఆర్డినరీ లీవుల బ్యాలెన్సు = 55 అన్నమాట.

ఉదా ౩:
కొన్ని సంస్థల్లో ’కంపల్సరీ లీవు’ని అమలు చేస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది జనాలు అతిగా లీవులు పోగెయ్యటాన్ని నిరోధించటం కోసమూ, ఒకవేళ వాళ్ళ ఉద్యోగాల్లో చేయకూడనివి ఏవైనా చేసి కప్పి పుచ్చుతున్న పక్షంలో వాటిని బయటపడేసే అవకాశం కోసమున్నూ, ఉద్యోగులకీ ఒత్తిడి నుంచి కొంత ఊరటనివ్వటం కోసమూ, ఇలా పలు రకాల కారణాల రీత్యా, కొన్ని సంస్థల్లో ఈ ’కంపల్సరీ లీవు’ని అమలు చేస్తున్నారు. అంటే, ఏడాదికి ఓ వరుస పది రోజులు లీవు పెట్టి తీరాల్సిందే అనేది నిబంధన. (ఐతే, మొదటి స్టెప్పులోనే, పది లీవులు వాడుకున్నట్టు మనం లెక్కగట్టాం కాబట్టి, ఈ ఉదాహరణలో సంచిత ఆర్డినరీ లీవులు సంఖ్య 55దే ఉంటుంది)

ఇలా పోగేసుకోవటంలో ఏం లాభం? అదికదా అసలు విషయం. పేరులో ఉన్నట్టుగానే, ఇవి ఎన్‌క్యాషబుల్ లీవులు. అంటే, ఆ లీవులను వాడుకోకుండా, అన్ని రోజులకి జీతం పుచ్చుకోవచ్చు.ఈ విషయంలోని ట్రెడిషనల్ థింకింగ్ ఏంటంటే, ’ఎంత వీలైతే అంత పోగేసుకుందాం’ అని. పదవీ విరమణ సమయానికి ఉద్యోగి బేసిక్కులు, డియేలు ఎక్కువై ఉంటాయి కాబట్టి, అప్పుడు ఎన్‌క్యాష్ చేసుకుంటే, ఈ లీవులనుండి ఓ పెద్ద మొత్తాన్ని ఆశించవచ్చు.

కానీ, ఈ మధ్య ఇలా అనుకోలేకపోతున్నాం. ఎందుకంటే, అవ్వడానికి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులైనా, కాస్తో కూస్తో పురోగమించే లక్షణం ఉన్నవాళ్ళు, కనీసం ప్రభుత్వ సంస్థల్లోనైనా అటూ ఇటూ గెంతడాలు చేస్తున్నారు.

అలాంటప్పుడు, ఇలా ’పదవీ విరమణ – రిటైర్మెంట్ వరకూ పోగేసుకోవటం’ కుదరదు. కొన్ని సంస్థల్లో, రాజీనామా చేసిన వారికి, ఈ లీవులు పూర్తిగా మురిగి పోవటంగానీ, లేదా సగ భాగం మాత్రమే ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశంగానీ ఉండొచ్చు. అందుచేత, ఏ ఏడాదికి ఆ ఏడాదే, ఎంత వరకూ ఎన్‌క్యాష్ చేసుకోవచ్చో అంతా చేసేసుకోవడమే లాభదాయకం అని చెప్పుకోవచ్చు.

అలాగని, మనం ఖచ్చితంగా ఉద్యోగం మారతామని ముందే నిర్ణయించుకోనీ కూడా ఉండమే! పైగా, ఇలాంటి సంచిత లీవులని అత్యవసర/ఆరోగ్య విషయాల వల్ల లీవు పెట్టాల్సి వచ్చినప్పుడు సైతం వాడుకోవచ్చునాయే. అంచేత, ఎంతో కొంత ఎక్యుములేట్ చేసుకోవటం కూడా అవసరమే.

అలా జ్యూడిషియస్‌గా ఎన్‌క్యాష్ చేసుకుంటూ, పోగేసుకుంటూ రెండూ చేసుకుంటూ ముందుకు పోవలి. అలాగే, ’పదవీ విరమణ సమయంలో పెద్ద మొత్తాన్ని ఆశించి లీవులు పోగేసుకుంటారు’ అని చెప్పుకున్నాం కదా, ఆ లక్ష్యాన్ని కూడా వదులుకోకూడదు. ఇలా ఎన్‌క్యాష్ చెయ్యగా వచ్చిన డబ్బుని, అల్లాలు బెల్లాలుగా ఖర్చు చేసుకోకుండా, ఏదైన ఒక నమ్మకమైన ఎస్సెట్ క్లాస్ లో ఇన్వెస్టు చేసుకోవాలి. ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకోవచ్చుగానీ, దాని వల్ల వచ్చే రిటర్న్ అంత ఎక్కువగా ఉండదు. ఎంత ఎక్కువగా ఉండదు? పోగేసుకొన్న లీవులని చివరి బేసిక్కు డియేలతో జీతంగా పొందితే వచ్చేంత ఉండకపోవచ్చు. అందుకనే, ఆ మొత్తాల్ని తరగిపోని ఆస్థుల్లోకి మదుపు చెయ్యాలి.

ఇలా ప్రతి ఏడాది ఎన్‌క్యాష్ చేసుకొనే మొత్తం ఎక్కువ ఉండదు గాబట్టి, ఆ మొత్తంలో భార్యలకో / పిల్లలకో బంగారం కొన్నివ్వడం లాంటివి చెయ్యొచ్చు. లేదా పిల్లల పేర్లమీద ఓ పెద్ద మొత్తం ఇన్సూరెన్సులు తీసుకోవటం చెయ్యొచ్చు. (ఇన్సూరెన్సు ప్రీమియంలని మళ్ళీ ట్యాక్సు మినహాయింపుగా కూడా పొందచ్చు).

ఇక మీ దగ్గర ఇలాంటి చిన్న మొత్తాలతోనే అధిక లాభాన్ని (లాంగ్ టర్ములో ఐనా సరే) సాధించే ఐడియాలేమన్నా ఉంటే మీరు కూడా చెప్పొచ్చు.:)

————————————–
P.S.
౧. శరత్‌’కాలం’ పోస్టుల ప్రేరణతో….
౨. పర్సనల్ ఫైనాన్సు పై అజ్ఞానాన్ని బయటేసుకుంటూ….
౩. ఓ కుర్రాడికొచ్చిన అనుమానానికి ఈ విధంగా సలహానిస్తూ…
౪. ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఆశిస్తూ…
౫. వెనుకబాటుతనం నుంచి బయటేసే మదుపు ఐడియాలెవరైనా ఇస్తారిని ఆశతో….
6. మరో అరడజను ఆలోచనలతో…

మనోహరా! ’మోక్షం’లోనూ ’భిన్నత్వం’ ఉందిట!

సమర్పింపబడినది ఫిబ్రవరి 23, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

’శ్రీ’ గారు నయం. మూడూ ఒక్కటే నన్నారు. వీరెవరో రఘోత్తమరావుగారట, మోక్షంలోనూ భిన్నత్వం ఉందన్నారు చూశారా? సరిగ్గా నిన్నటి పోస్టు ఇలా పబ్లిష్ చేశానో లేదో, అప్పుడు చూశాను, వారి కామెంటు. కనీసం ’శ్రీ’ గారు ఇదంతా ఇంటేగ్రేషనే అని చెప్పటానికి వస్తే, వీరేమో ఇదంతా డిఫరెన్షియేషనే అంటున్నారు.

వీళ్ళ ’జ్ఞానం’ చల్లంగుండ, ’మోక్షం’లోనూ ’భిన్నత్వం’ ఉందిట. మనం ఎందుకు ఆనందిచాలో తెలుసా?  గుడ్డిలో మెల్ల –  “దేవుడు ఒక్కడు కాదు” అన్లేదు, బతికిపోయాం! హ హ హ :))

ఇంతకీ మీ భిన్నత్వానికి ఏం ఢోకా లేదని ఇప్పటికైనా నమ్ముతారా?అందరకీ దక్కేది ఒకే పరమపదం కాదు ట! మోక్షంలోనూ భిన్నత్వం ఉంది ట! గట్టిగా మాట్లాడదామా అంటే, ఉపనిషత్తులు కూడా కోట్ చేస్తున్నారాయే. ఏంటి భయపడి వెనక్కి తగ్గుదామా లేక – అంతా ఒక్కటేనిని గట్టిగా వాదిద్దామా?

మీరు సాఫ్టువేర్ ఇంజనీర్ అని, మీరేసిన పోస్టుల్లో ఎక్కడినుంచో ఊహిస్తున్నాను. ఎందుకు చెబ్తున్నానంటే, సాఫ్టువేర్‌ ఉద్యోగం అంటే, చాలా ఇంటలిజెంట్ అయ్యుంటారు కదా. నేనేమో కాస్త ’తక్కువ’ తెలివిగలవాడిని. ఎందుకైన మంచిది, “అంతా ఒకటే” అని నేను వాదించటంలో ఓడిపోకుండా, మీరు కూడా కాస్త నాకు దన్నుగా నిలబడాలి మరి! ఆ!

—————————————–

x = జడ; ఓ రెండు జడలు (అమ్మాయివి కాదండి) :  లైక్,   బంగారం- రాయి; చెక్క-మట్టి.
y = జీవ; ఓ రెండు జీవాలు; లైక్, మీరు-నేను; మనిషి – జంతువు;
z = ఈశ; అదేలెండి ఓ దేవుడు

ఇప్పుడు ఎన్ని కాంబినేషన్లెయ్యొచ్చు : xx, xy(yx), xz(zx), yy, yz and zz.  మొత్తం ఆరు భేదాలు- తన్నుకు చావటానికి.

oops! ఇక్కడో చిన్న విషయం. రెండు దేవుళ్ళు లేరుగా! అందుకని zz  రూళ్డ్ ఔట్. సో, ఉన్నవి ఐదే!

xx , xy, xz, yy and yz 

జడ-జడ , జడ-జీవ, జడ – ఈశ, జీవ – జీవ, జీవ – ఈశ ;

మ్…హు వారి ఆర్డర్ లో పెడదాం. క్లారిటీకీ.

జీవ-జీవ, జీవ-జడ, జడ-జడ, ఈశ-జీవ మరియు ఈశ-జడ

ఇదేంటోయ్! ఇంత లాజికల్‌గా ఉన్న విషయాన్ని పట్టుకొచ్చి, ” This is sheer logic. But logic itself is not philosophy.” అంటూ, మనమేదో లాజిక్కుల్లో చచ్చే పురుగుల్లా, వారేదో అంతగంటే గొప్ప విషయం తీసుకొచ్చినట్టు మాట్లాడారు!?

పైగా –

“జీవేశ్వర భిదా చైవ జడేశ్వర భిధా తథా
జీవ భేదో మితశ్చైవ జడ జీవ భిధా తథా
మితశ్చ జడ భేదోయం ప్రపంచో భేదపంచకః”

అన్న పరమోపనిషత్ వాక్కులు ఆధారం.

అంటూ బహు గంభీరంగా మనలని భయపెట్టారు. దీనికి ఉపనిషత్తుల తోడెందుకు? సొంతగా డెడ్యూస్ చెయ్యలేమా?

అందుకే మనోహరా! నే చెప్పేదేంటంటే – ఈ గోల చచ్చిపోయినా, మనకి కావల్సింది మనకు దొరుకుతుంది. “నువ్వే దేవుడ”ని ఋషులు చెబ్తుంటే, మీరు కనీసం  ఋషులవ్వడానికి సైతం భయపడితే ఎలా? ప్రయత్నించకపోతే ఎలా?

సరే, వీళ్ళతో ఇంకా టైం వేస్టు చేసుకుందామంటారా? బట్ యూ నో సంథింగ్, మనం టైం వేస్టు అనుకుంటే, అందరినీ ఎలా కలపుకుపోగలం? ఇంటేగ్రేషన్ ఎలా సాధించగలం? పైగా, ఇలా కలుపుకోకుండా, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తే, రేపు ఇదే “వివక్ష” అయి కూర్చోవచ్చు. ఓ పని చేయకూడదు…..మీరు కలుపుకు రాకూడదూ? ఏమంటారు?

————————–

అన్నట్టు, ఇదంతా పెర్ముటేషన్సు కాంబినేషన్సుల సింబల్స్ – nPr, nCr లలో ఎలా చెప్పాలి? సూపర్ స్క్రిప్టు, సబ్ స్క్రిప్టు ఎలా రాయాలి? కొంచెం చెప్పరూ…ప్లీజ్.

అలాగే ఎవరన్నా కాస్త ఓపిక చేసుకొని, ఈ శరీరం పాంచ బౌతికమెలాగయ్యిందో, ఆ తర్వాత ఇంకా “ఎన్ని” అయ్యిందో ఎవరన్నా ఆ కుర్రోడికి చెప్పండయ్యా. పెద్దాయానెవరో పీరియాడిక్ టేబుల్ దాకా రాసినట్టు గుర్తు. కాస్త చూసి, అటు పంపియ్యండయ్యా…మీకు పుణ్యం ఉంటుంది!